Saturday, November 24, 2018

         ముగురు బిడ్డల తల్లి.

సీ.
వినుత  సౌందర్యము మీదు  సొ త్తు కలదే
                  నూనూగు నెత్తావి నో యితరము
ప్రకృతిలో మీకొక స్థాన మున్నదని యా
                  క్రోశింతురే యెవ్వరున్ గడుసరి!
సుమతి! చాంచల్యము జెందనీకు మనసే
                మార్చన్ దలంచున్ సుమా మరిమరి
విగత వాదప్రతి వాదముల్ మరచి సాం
                  గత్యమ్ము సాగింపగా వలెనిక
తే.గీ./ఆ.వె
ఏల విరుల గోయు తలపదేల  మనుజు
లేల మిమ్ము త్రెంచెదరిక లేదదేల
మనిషి పై గురి కలదే లమకుడ నేను
సమ్మతింపరె నను జాల సరసిజములు.
(లమకుడు=ప్రియుడు)
ఈ సీస పద్యం మరో మూడు పద్యాలను కన్నది.
చూద్దామా:
1. మొదటి నాలుగు పాదాలలో తొలి అక్షరాన్ని ఆఖరి నాలుగు అక్షరాలను తొలగిస్తే మత్తేభం వస్తుంది.
మ.
నుత సౌందర్యము మీదు సొత్తు కలదే నూనూగు నెత్తావి నో
కృతిలో మీకొక స్థాన మున్నదని యాక్రోశింతురే యెవ్వరున్
మతి చాంచల్యము జెందనీకు మనసేమార్చన్ తలంచున్ సుమా
గత వాదప్రతివాదముల్ మఱచి సాంగత్యమ్ము సాగింపగా.
2.ఆట వెలది యధాతథంగా ఆ తేటగీతమే.
3. కందం.
ఏల విరుల గోయు తలప
దేల మనుజు లేల మిమ్ము త్రెంచెదరిక లే
దేల మనిషి పై గురి కల
దే లమకుడ నేను సమ్మతింపరె నను జాల్.
మనవి: కుసుమ వికాసం అనే ఓ ఖండిక. అందులో పూలు ఓ నరుని మధ్య వాద ప్రతివాదాలు జరిగి చివరకు ఒక ఒడంబడిక సాధిస్తారు. అందులో ఇదో గారడీ.
ఇది కూర్చడానికి రెండు రోజుల శ్రమ అవుసర పడింది.
చదివి తప్పొప్పులు సలహాలు తెలుప గలరు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home