తిరుపతి వేంకట కవులు
సీ. పద్యపు పల్కుకున్ పట్టము గట్టి అం
బారి ఎక్కించి సంబరపడితిరి
అవధాన విద్యకు ఆయువు లూది ఊ
రూర ఆశుకవితకు ఊపు తెచ్చి
ఉద్యోగ విజయము నుఱ్ఱూత లూగించి
ఆణి ముత్యమనగ అలరు నటుల
పశుల కాపరి కూడ పాడునా పద్యాలు
మూడు కాళ్ళ ముసలి మురిసి పోవు
తే.గీ. నటుల తెలుగు అందెలు ఘల్లు ఘల్లు మనగ
జంట కవులను ఒరవడి జాతి కిచ్చి
దనిసె కవితా వధూటి పద పథమున
కదలి తిరుపతి వేంకట కవులు మిగిలె.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home