నాగరీకం ముదిరిందా
వసతులెన్నో వసుంధర కోల్పోయాక
నగరాలలో కనరావు వసంతుని నగారాలు
కోవెల కుహుకుహూ రాగాలు పంచమ స్వరాలు
గతస్మృతులుగా మనసులు నింపుకుని
ప్రగతి పథగమన భ్రమైక పథంలో పయనిస్తూ
ప్రకృతి ని శాసిస్తూ జనం
జనాళిని శపిస్తూ ప్రకృతి
పట్టు కోసం పట్టుకు ఛస్తుంటే
సహజ సౌందర్య మహి మహిమ లెక్కడ
రమణీయ ప్రకృతి కాంత రాశీ రూప మెక్కడ
అయాచితంగా వచ్చిన వనరులన్నీ
అనాలోచితంగా నాశనం చేస్తుంటే
విలయ వలయాలు అనల పవనాలూ
మహోగ్ర సూర్య కిరణాలూ సర్వ సాధారణాలు
ప్రాణవాయువును కూడా కొనుక్కోవాలేమో
నీటికి ఎద్దడి , దాహం తీర్చే నాథుడు ఏడీ?
మిన్నేటి పన్నీటిని గతి మార్చి ఏమార్చి
భువి బాట పట్టించి పృథ్వీ లలామను స్నానమాడింపించే భగీరథులేరీ
పంట కరవై పాడి బరువై రైతు గుండె చెరువై
నీతిమాలిన జాతిహీనత మనదా?
నాగరీకం ముదిరిందా? నడిరోడ్డున పడిందా?
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home