వీడ్కోలు
ద్వి సహస్ర పంచ దశాబ్దమా
కదలు బెట్టు మాని కదలు నీలుగులు మాని.
ఎన్నెన్ని వ్యధలు, గుండె కోతలు
పంచావు ఈ అవని పై అందరికీ
చాలు చాలు నీ నిర్వాకాలు
నీ కిదే మా వీడ్కోలు.
వ్నక్కి తిరిగి చూడకు
యీ వసుంధర ముఖాన యింకా
రక్తపు మరకలు చెరిగి పోలేదు
ఉగ్రవాదులు, తీవ్రవాదులు, కామందులూ
పెట్రేగి పోయారు నీ నీడలో
నిర్భయంగా నిర్భాయను అతి క్రూరంగా చెరచిన
ఆ సప్తదశ వయః కామపిశాచి
యదేచ్చగా తిరుగుబోతులా
తిరుగమని చెరసాలనుంచి వదిలేసావు.
మరో ఖండంలో వలసల వెల్లువలో
సాగర తీరానికి కొట్టుకొచ్చిన పసివాణ్ణి చూసి
మానవ జాతి ముక్కున వేలేసుకుంది
తుపాకీల ఫిరంగుల మోతలు ఒక మూల
గగనతలంలో విహంగాల విధ్వంసాలు
యిలా తలంలో భూ ప్రకంపనలు, తుఫానులూ
జలధి తరంగాల పై విస్ఫోటాలు
ఎన్నెన్ని మారణ హోమాలు చేయించావు
ఎన్నెన్ని ఆయువులు పెరికించావు.
మన నేలపై గాది కింద పంది కొక్కులు
గాదెలు ఖాళీ చేసేసి కూడా
లబోదిబో మని ఏడ్పులు
అసహనం పెరిగి పోయిందంటూ
'స్వ' భావాని అందరిపై రుద్దారు
కంటి నీటి తుడుపుగా
అమరావతిలో విజయ దశమి
ఏడాది చివరలో
లాహోర్లో విందు
ఒక అయుత చండీ యాగం
అవే మాకు మిగిలిన తీపి గురుతులు
చాలు చాలు నీ నిర్వాకాలు
నీ కిదే మా వీడ్కోలు.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home