Saturday, March 26, 2016

సాంత్వన 

మనస్సు వికలమైనప్పుడల్లా
ఒంటరిగా ఉండాలనిపిస్తుంది.
నింగిలోకి తొంగి చూడాలనిపిస్తుంది
సాగర తీరంలో పడిలేచే కెరటాలవైపు
తదేకంగా చూడాలనిపిస్తుంది.
ఓడిన ప్రతిసారీ
పోతనగారి అశ్వత్థామ గర్వ భంగం
చదవాలనిపిస్తుంది.
కృంగిన ప్రతిసారీ
భట్టీ విక్రమార్కుణ్ణి తలచుకోవాలనిపిస్తుంది.
ఓదార్పు , సాంత్వన పట్టుదలా
అన్నీ ఆ ప్రకృతిలోనే పొందాలనిపిస్తుంది.  

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home