సాంత్వన
మనస్సు వికలమైనప్పుడల్లాఒంటరిగా ఉండాలనిపిస్తుంది.
నింగిలోకి తొంగి చూడాలనిపిస్తుంది
సాగర తీరంలో పడిలేచే కెరటాలవైపు
తదేకంగా చూడాలనిపిస్తుంది.
ఓడిన ప్రతిసారీ
పోతనగారి అశ్వత్థామ గర్వ భంగం
చదవాలనిపిస్తుంది.
కృంగిన ప్రతిసారీ
భట్టీ విక్రమార్కుణ్ణి తలచుకోవాలనిపిస్తుంది.
ఓదార్పు , సాంత్వన పట్టుదలా
అన్నీ ఆ ప్రకృతిలోనే పొందాలనిపిస్తుంది.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home