ఇదండీ మన నవభారతం
పదే పదే పాకులాడితే పలుచనై పోతాంవ్యామోహం లో పడితే మిగిలేది అగౌరవం
మోజు పడితే కొండెక్కి కూచోవడం రివాజు
పలుకే ప్లాటినం అన్నట్టు అనుకునే మారాజు
ఉలుకే బంగారమనుకునే వారిదే ఈరోజు
కాని వారితో కలుపుగోలు గా ఉండటం
అయిన వారికి ఆమడ దూరం నిలవడం
తలిసీ తెలియని ఒంటరి తెంపరితనం
వచ్చీ రాని ప్రాయం విరిసీ విరియని పరువం
మంచి అని ఎఱిగినా ఏమీ ఎరుగనట్టు ముఖం
ఇదండీ మన పదహారేళ్ళ నవ భారతం
మేలు కోరి ఊసాడితే అపార్థం
మేలాడి బ్రతిమాలితే అసహనం
ఇదండీ ఇంటింటా జరుగుతున్న భాగోతం
కాదు కూడదు అంటే మరో భారత సంగ్రామం.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home