(నిన్నటి తరువాయి)
వాత్సల్యము నుండి అమాంస భక్షణము వరకు చెప్పుకున్నవి అష్టవిధ భక్తి విధానాలు.
మొదటగా ఐశ్వర్య భక్తి మాధుర్య భక్తి పరిశీలిద్దాం.
ఐశ్వర్య భక్తి:
భగవత్స్వరూపమే ఒక ఐశ్వర్యం. అంటే అదే సంపద. భగవద్దర్శనం కోసం పరితపించి ఆ అనుభూతిని పొందడమే మహదైశ్వర్యం. దీనికి ఉదాహరణగా త్యాగరాజు, రామదాసు వంటి వారిని పరికించ వచ్చు. వారు ఆ శ్రీ రామచంద్రుణ్ణి ధన కనక వస్తు వాహన ప్రాప్తి కోరుకో లేదు. అలాగే అర్జనుడు విశ్వరూప దర్శనం చేయడం. ఇందులో భగవంతుని నుంచి భిన్నంగా ఉంటూ ఆ పరమాత్మ పై గౌరవం కొంత భయము కలిగి ఉండటం కద్దు.
ఆ భగవంతుని నగుమోము గనలేని నాజాలి తెలిసి నను బ్రోవవేల అని ఆర్తితో వెంపర్లాడినది కేవలం ఆ దర్శనం కోసమే.
అలాగే విశ్వరూప దర్శనం జరిగాక యథాతద పూర్వ రూపమే కోరకుంటాడు కిరీటి. కారణం భగవంతునిపై ఉన్న గౌరవమూ భయమూ కూడా. రాజు పై ప్రజలకున్న భక్తి కూడా యీ కోవలోకే వస్తుంది.
మాధుర్య భక్తి:
భగవంతునితో ఒక అనుబంధం ఒక ఆత్మీయతా భావం ఏర్పరుచు కోవడం మాధుర్య భక్తి. వ్యక్తిగత జీవితంలో భగవంతునితో పెనవేసుకు పోవడం జరుగుతుంది. ఇందుకు ఉదాహరణగా యుద్ధానంతరం హనుమ కనబరచిన భక్తి.
యశోద కృష్ణుల అనుబంధం. కలయో వైష్ణవ మాయయో అని తలచేనాటికే యశోదకు ఈ చిన్ని కృష్ణుడు విష్ణ్వంశ సంభూతుడన్న ఎరుక ఉంది. అందుచేతనే ఒకప్రక్క కమారుడుగా తనని సాకినా మరో ప్రక్క భగవంతుడనే భావమూ యశోద మనస్సులో ఉండేది.
కృష్ణునితో మీరాభాయి , రాధ ల అనుబంధం అలాంటిదే. ఇంక గోపికల రాసక్రీడలూ , అనసూయ త్రిమూర్తుల అనుబంధాలన్నీ ఒక మధురమైన వయక్తిక బంధాలే. ఇది అన్నిటికన్న ఉత్కృష్టమైన భక్తి అని చెప్పవచ్చు.
ఈ మధుర భక్తిలో దాస్యము, సఖ్యత, వాత్సల్యమూ అంతర్భాగలే.
రేపు త్రివిధ భక్తి పరిశీలించుదాం. (సశేషం)
వాత్సల్యము నుండి అమాంస భక్షణము వరకు చెప్పుకున్నవి అష్టవిధ భక్తి విధానాలు.
మొదటగా ఐశ్వర్య భక్తి మాధుర్య భక్తి పరిశీలిద్దాం.
ఐశ్వర్య భక్తి:
భగవత్స్వరూపమే ఒక ఐశ్వర్యం. అంటే అదే సంపద. భగవద్దర్శనం కోసం పరితపించి ఆ అనుభూతిని పొందడమే మహదైశ్వర్యం. దీనికి ఉదాహరణగా త్యాగరాజు, రామదాసు వంటి వారిని పరికించ వచ్చు. వారు ఆ శ్రీ రామచంద్రుణ్ణి ధన కనక వస్తు వాహన ప్రాప్తి కోరుకో లేదు. అలాగే అర్జనుడు విశ్వరూప దర్శనం చేయడం. ఇందులో భగవంతుని నుంచి భిన్నంగా ఉంటూ ఆ పరమాత్మ పై గౌరవం కొంత భయము కలిగి ఉండటం కద్దు.
ఆ భగవంతుని నగుమోము గనలేని నాజాలి తెలిసి నను బ్రోవవేల అని ఆర్తితో వెంపర్లాడినది కేవలం ఆ దర్శనం కోసమే.
అలాగే విశ్వరూప దర్శనం జరిగాక యథాతద పూర్వ రూపమే కోరకుంటాడు కిరీటి. కారణం భగవంతునిపై ఉన్న గౌరవమూ భయమూ కూడా. రాజు పై ప్రజలకున్న భక్తి కూడా యీ కోవలోకే వస్తుంది.
మాధుర్య భక్తి:
భగవంతునితో ఒక అనుబంధం ఒక ఆత్మీయతా భావం ఏర్పరుచు కోవడం మాధుర్య భక్తి. వ్యక్తిగత జీవితంలో భగవంతునితో పెనవేసుకు పోవడం జరుగుతుంది. ఇందుకు ఉదాహరణగా యుద్ధానంతరం హనుమ కనబరచిన భక్తి.
యశోద కృష్ణుల అనుబంధం. కలయో వైష్ణవ మాయయో అని తలచేనాటికే యశోదకు ఈ చిన్ని కృష్ణుడు విష్ణ్వంశ సంభూతుడన్న ఎరుక ఉంది. అందుచేతనే ఒకప్రక్క కమారుడుగా తనని సాకినా మరో ప్రక్క భగవంతుడనే భావమూ యశోద మనస్సులో ఉండేది.
కృష్ణునితో మీరాభాయి , రాధ ల అనుబంధం అలాంటిదే. ఇంక గోపికల రాసక్రీడలూ , అనసూయ త్రిమూర్తుల అనుబంధాలన్నీ ఒక మధురమైన వయక్తిక బంధాలే. ఇది అన్నిటికన్న ఉత్కృష్టమైన భక్తి అని చెప్పవచ్చు.
ఈ మధుర భక్తిలో దాస్యము, సఖ్యత, వాత్సల్యమూ అంతర్భాగలే.
రేపు త్రివిధ భక్తి పరిశీలించుదాం. (సశేషం)
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home